More
    Homeఆంధ్రప్రదేశ్​Andhra Pradesh | చెల్లికి ఆస్తి ఇచ్చారని తల్లిదండ్రులను ట్రాక్టర్​తో ఢీకొట్టి చంపిన కసాయి కొడుకు

    Andhra Pradesh | చెల్లికి ఆస్తి ఇచ్చారని తల్లిదండ్రులను ట్రాక్టర్​తో ఢీకొట్టి చంపిన కసాయి కొడుకు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Andhra Pradesh : ఆధునిక సమాజంలో బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. డబ్బులు, ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. సొంత వారినే కడతేర్చుతున్నారు.

    ముఖ్యంగా తోబుట్టువులు, తల్లిదండ్రులనే పట్టించుకోకపోవడం అటుంచి, వారినే కిరాతకంగా వధిస్తున్న ఉదంతాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్​లో మరో దారుణం చోటుచేసుకుంది. చెల్లికి ఆస్తి రాసిచ్చారని తల్లిదండ్రులను ఓ దుర్మార్గుడు ట్రాక్టర్​తో అతికిరాతకంగా ఢీకొట్టి కడతేర్చాడు. బుడి బుడి  అడుగులు వేయించిన తల్లినే హత మార్చాడు. భుజాన ఎత్తుకుని లోకం చూపించిన తండ్రిని ఈ లోకం నుంచే భయానకంగా పరలోకానికి సాగనంపాడు.

    విజయనగరం Vizianagaram జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో అప్పలనాయుడు(55), జయ (45) దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు తమ ఆస్తిని ఇరువురికి ఇచ్చారు. ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడం పుత్రరత్నం రాజశేఖర్​కి నచ్చలేదు. దీంతో తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. ఇదే విషయమై వారి మధ్య తరచూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే కుమార్తెకు ఇచ్చిన భూమిని శనివారం(ఏప్రిల్​ 26) రాజశేఖర్ ట్రాక్టర్​తో చదును చేస్తున్నాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని కుమారుడిని వారించారు. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన రాజశేఖర్..​ ట్రాక్టర్​తో వారిని ఢీకొట్టి చంపేశాడు.

    READ ALSO  Tollywood Industry | చంద్ర‌బాబుతో టాలీవుడ్ ప్ర‌ముఖుల మీటింగ్ క్యాన్సిల్.. కార‌ణం ఏంటంటే..!

    Latest articles

    Banana Exports | అర‌టిపండ్ల ఎగుమ‌తిలో ఈక్వ‌డ‌ర్ టాప్‌.. 16వ స్థానంలో నిలిచిన ఇండియా

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Banana Exports | ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన, రుచికరమైన పండ్లలో అరటిపండ్లు(Bananas) ఒకటి. కొన్ని దేశాల...

    Indus River | పాక్‌కు షాక్ ఇవ్వ‌నున్న ఇండియా.. సింధు జ‌లాల మ‌ళ్లింపున‌కు య‌త్నాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Indus River | ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్‌(Pakistan)కు వ‌రుస షాక్‌లు ఇస్తున్న ఇండియా.. మరో షాక్...

    Nvidia CEO | అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపారిగా మ‌స్క్‌.. రెండో స్థానంలో ఎన్విడియా చీఫ్‌..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nvidia CEO | ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపార‌వేత్త‌ల్లో ఎలాన్ మ‌స్క్(Elon Musk) మొద‌టి స్థానంలో...

    PCC Chief | ఫోన్​ ట్యాపింగ్ కేసు​పై పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: PCC Chief | ఫోన్​ ట్యాపింగ్(Phone Tapping)​ వ్యవహారంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్​ కుమార్​...

    More like this

    Banana Exports | అర‌టిపండ్ల ఎగుమ‌తిలో ఈక్వ‌డ‌ర్ టాప్‌.. 16వ స్థానంలో నిలిచిన ఇండియా

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Banana Exports | ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన, రుచికరమైన పండ్లలో అరటిపండ్లు(Bananas) ఒకటి. కొన్ని దేశాల...

    Indus River | పాక్‌కు షాక్ ఇవ్వ‌నున్న ఇండియా.. సింధు జ‌లాల మ‌ళ్లింపున‌కు య‌త్నాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Indus River | ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్‌(Pakistan)కు వ‌రుస షాక్‌లు ఇస్తున్న ఇండియా.. మరో షాక్...

    Nvidia CEO | అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపారిగా మ‌స్క్‌.. రెండో స్థానంలో ఎన్విడియా చీఫ్‌..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nvidia CEO | ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపార‌వేత్త‌ల్లో ఎలాన్ మ‌స్క్(Elon Musk) మొద‌టి స్థానంలో...