అక్షరటుడే, వెబ్డెస్క్ : Spying for Pakistan | పాకిస్తాన్ pakistan కు భారత రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న ఓ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack లో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిఘా వైఫల్యం ఉందని కేంద్రం అంగీకరించింది. అనంతరం భారత నిఘా వర్గాలు intelligence agencies అప్రమత్తం అయ్యాయి. భారత్ ఆపరేషన్ సిందూర్ Operation Sindoor చేపట్టడంతో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భావించి అనుమానితులపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో భారత్కు చెందిన పలువురు పాకిస్తాన్కు గూఢచారులుగా పనిచేస్తున్నట్లు గుర్తించాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా తాజాగా ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ Businessman Shahzad ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Spying for Pakistan | ఐఎస్ఐతో సంబంధాలు
వ్యాపారవేత్త షాజాద్కు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ISIతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. గూఢచర్యం పంచుకునేందుకు షాజాద్ పలుమార్లు పాక్ వెళ్లొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గూఢచర్యంతోపాటు పాక్కు స్మగ్లింగ్ (Smuggling) చేస్తున్నాడనే సమాచారంతో అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. అతడిని మొరాబాద్ Morabadలో అరెస్ట్ చేశారు. దేశ భద్రతకు సంబంధించిన పలు సమాచారాన్ని షాజాద్ ఐఎస్ఐకి చేరవేసినట్లు అధికారులు తెలిపారు.
Spying for Pakistan | ఐఎస్ఐ రిక్రూట్మెంట్కు సాయం
షాజాద్ కాస్మొటిక్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలను అక్రమంగా సరిహద్దులు దాటించాడని అధికారులు తెలిపారు. స్మగ్లింగ్తో పాటు గూఢచర్యానికి పాల్పడినట్లు వివరించారు. ఐఎస్ఐ ఏజెంట్లకు డబ్బుతోపాటు సిమ్కార్డులు కూడా అందించాడని దర్యాప్తులో తేలిందన్నారు. పాక్ నిఘా సంస్థ కోసం రిక్రూట్మెంట్ కోసం సాయం చేశాడని తెలిపారు. దీనిలో భాగంగా యూపీలోని రామ్పూర్తోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారిని పాకిస్తాన్కు పంపించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Spying for Pakistan | కలకలం రేపుతున్న అరెస్టులు
ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్ గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరస్పర దాడులతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. అయితే, కాళ్ల భేరానికి వచ్చిన పాక్ కాల్పుల విరమణకు ప్రతిపాదించడంతో భారత్ అంగీకరించింది. అయితే, దీని తర్వాత ఉగ్రవాద కార్యకాలపాలపై దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టగా, అనేక మంది ఇండియాలో ఉంటూ ఐఎస్ఐ కోసం పని చేస్తున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేయగా, తాజాగా యూపీలో షాజాద్ను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.