అక్షరటుడే, వెబ్డెస్క్ : Srisailam | శ్రీశైలం Srisailam ఘాట్ రోడ్డు(Ghat Road)లో గురువారం ప్రమాదం accident చోటు చేసుకుంది. ఓ బస్సు bus బ్రేకులు ఫెయిల్ అవడంతో కొండను ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి.
కర్ణాటక karnataka సిరిగుప్పకు చెందిన 43 మంది ఆధ్యాత్మిక పర్యటన నిమిత్తం టూరిస్ట్ బస్సులో tourist bus బయలు దేరారు. శ్రీశైలం, అయోధ్య, కాశీ క్షేత్రాలను సందర్శించడానికి బుధవారం తమ యాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం దొర్నాల నుంచి శ్రీశైలం వస్తుండగా చిన్నారుట్ల వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు కొండను ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.