అక్షరటుడే, ఎల్లారెడ్డి: Gandhari | గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును (MLA Madan Mohan Rao) కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధారికి 2 కి.మీ దూరంలో కళాశాల నిర్మించడంతో విద్యార్థులు అడ్మిషన్ పొందడానికి సుముఖత చూపడం లేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బస్టాండ్ నుంచి ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బస్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు.
అలాగే లింగంపేట్ (Lingampet), బానాపూర్, పేట్సంగెం మీదుగా గాంధారి వరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. గాంధారి మండలంలో విద్యార్థులకు వసతి గృహాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గంగారాం, అధ్యాపకులు లక్ష్మణ్, రాజగోపాల్, జెట్టి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.