అక్షరటుడే, వెబ్డెస్క్:Odisha | ఒడిశాలో ఓ భారీ అవినీతి తిమింగలం విజిలెన్స్ అధికారులకు(vigilance officers) చిక్కింది. సదరు అవినీతి అధికారి ఇంట్లో నోట్ల కట్టలను చూసి తనిఖీలకు వెళ్లిన అధికారులే షాక్ అయ్యారు.
భువనేశ్వర్(Bhubaneswar)లోని గ్రామీణ పనుల విభాగం చీఫ్ ఇంజనీర్ బైకుంత నాథ్ సారంగికి సంబంధించిన పలు ప్రాంతాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. సదరు అధికారి ఇంట్లో రూ.2.1 కోట్లకు పైగా విలువైన లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు రావడంతో అధికారులు దాడు చేశారు.
Odisha | నోట్లను విసిరేసుందుకు యత్నం
అధికారులు దాడులు చేయడంతో బైకుంతనాథ్ తన ఇంట్లోని నగదును కిటికీలో నుంచి బయట పడేసేందుకు యత్నించినట్లు తెలిసింది. రూ.500 నోట్ల కట్టలను(500 rupee notes bundles) విసిరేశాడని అధికారులు తెలిపారు. అధికారులు ఆ నోట్ల కట్టలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్, అంగుల్, పిపిలి (పూరి) లోని ఏడు ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
Odisha | భారీగా అక్రమాస్తులు
భువనేశ్వర్లోని దుండుమాలోని సదరు అవినీతి అధికారి ప్లాట్ నుంచి సుమారు రూ.కోటి, అంగుల్ జిల్లా కరడగాడియాలోని అతని రెండంతస్తుల నివాసంలో సుమారు రూ.1.1 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడు భారీగా అక్రమాస్తులు(Illegal assets) కూడబెట్టినట్లు గుర్తించారు. అంగుల్లోని రెండంతస్తుల ఇల్లు, భువనేశ్వర్లో ఒక ఫ్లాట్, పూరిలోని సియులాలో ఒక ఫ్లాట్, అంగుల్లోని బంధువు ఇల్లు, అంగుల్లోని సారంగి తండ్రి ఇల్లు, అంగుల్లోని రెండంతస్తుల భవనం, భువనేశ్వర్లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలోని అతని గదిలో తనిఖీలు చేశారు. ఆ దాడుల్లో ఎనిమిది మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు, 12 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.