ePaper
More
    Homeక్రీడలుJasprit Bumrah | ‘ఎవ‌రి భార్య‌నో కాల్ చేస్తున్నారు, నేనయితే ఫోన్​ ఎత్త‌ను..’ సీరియస్​ ప్రెస్...

    Jasprit Bumrah | ‘ఎవ‌రి భార్య‌నో కాల్ చేస్తున్నారు, నేనయితే ఫోన్​ ఎత్త‌ను..’ సీరియస్​ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో న‌వ్వులు పూయించిన బుమ్రా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jasprit Bumrah | లార్డ్స్ మైదానంలో భారత్‌–ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులకు ఆలౌట్ కాగా, భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీసి ఆక‌ట్టుకున్నాడు. అయితే రెండో రోజు ఆట ముగిసిన తర్వాత బుమ్రా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. భద్రతా నిమిత్తం జర్నలిస్టులు (Journalists) తమ మొబైల్ ఫోన్లను టేబుల్‌పై ఉంచగా, సమావేశం మధ్యలో ఓ రిపోర్టర్ ఫోన్ రింగ్ అయ్యింది. దాన్ని గమనించిన బుమ్రా నవ్వుతూ, “ఎవరి భార్యో ఫోన్ చేస్తోంది.. కానీ నేను ఈ ఫోన్ ఎత్తను” అని సరదాగా వ్యాఖ్యానించాడు.

    Jasprit Bumrah | ఫ‌న్నీ కామెంట్స్..

    ఆ తర్వాత ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతూ, “మీరు అడిగిన ప్రశ్న మర్చిపోయా… మళ్లీ అడగండి” అని నవ్వుతూ చెప్పాడు. దీంతో మీడియా సమావేశం (Press Conference) స‌ర‌దాగా సాగింది. అక్కడున్న వారంతా కాసేపు నవ్వుకున్నారు. మొదటి రోజు కేవలం ఒక వికెట్ మాత్ర‌మే తీసిన బుమ్రా, రెండో రోజున స్టోక్స్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఆర్చర్ వంటి కీలక ఆటగాళ్లను ఔట్ చేస్తూ మ్యాచ్‌ను భారత్ వైపునకు తిప్పాడు. హ్యారీ బ్రూక్‌(Harry Brooke)ను బౌల్డ్ చేసిన బంతి ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మొత్తంగా బుమ్రా ఐదు వికెట్లు తీసి మళ్లీ తన ‘బూమ్ బూమ్’ ఫామ్‌ను చూపించాడు.

    READ ALSO  IND vs ENG | చేతులెత్తేసిన భార‌త బ్యాట్స్‌మెన్స్.. లార్డ్స్‌లో చరిత్ర సృష్టించ‌లేక‌పోయిన గిల్ సేన‌

    ఇంగ్లాండ్ (England)కు ధీటుగా బ‌దులిచ్చే క్ర‌మంలో భారత్ రెండో రోజు బ్యాటింగ్‌ను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఇక మూడో రోజు కేఎల్ రాహుల్ (85 నాటౌట్), పంత్ (Rishabh Pant) (55 నాటౌట్) కీల‌క ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్స్ వంద ప‌రుగుల భాగస్వామ్యం నెల‌కొల్పారు. గాయంతో బాధ‌ప‌డుతున్న పంత్ అలానే బ్యాటింగ్ చేస్తూ మ‌రో అర్ధ‌సెంచ‌రీ చేశాడు. ఇక రాహుల్ నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 3 వికెట్లు కోల్పోయి 216 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోరుని స‌మం చేయాలంటే మ‌రో 171 ప‌రుగులు చేయాల్సి ఉంది.

    Latest articles

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...