అక్షరటుడే, వెబ్డెస్క్ : Anantapuram | అనంతపురం ( Anantapuram) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థినిని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. ఉరవకొండ (Uravakonda) నియోజకవర్గం కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద కాలిన స్థితిలో మృతదేహం లభించింది.
కాగా తమ కూతురు కనిపించడం లేదని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. కాల్ లిస్ట్ పేరుతో కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ముందుగానే స్పందించి ఉంటే తమ కూతురు బతికేదని వారు వాపోయారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.