అక్షరటుడే, వెబ్డెస్క్:Hyderabad | హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగుల దాడిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.
మాదాపూర్ యశోద ఆస్పత్రి(Yashoda Hospital) వెనుక ఓ యువకుడిని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మణికొండ ప్రాంతానికి చెందిన జయంత్గౌడ్(21) తన తల్లి బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్కు పార్టీ ఇవ్వాలని భావించాడు. ఎనిమిది మంది స్నేహితులతో కలిసి యశోద ఆస్పత్రి వెనకాల మద్యం తాగుతుండగా ముగ్గురు దుండగులు వచ్చి వారిని బెదిరించారు.
బంగారం, డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. వారితో జయంత్గౌడ్ అతని స్నేహితులు వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో దుండగులు జయంత్ గౌడ్పై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు(Madhapur Police) ఘటన స్థలంలో పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.