అక్షరటుడే, వెబ్డెస్క్ :Harish Rao | బీఆర్ఎస్(BRS) ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ను బీజేపీ(BJP)లో విలీనం చేయాలని చూస్తున్నారని ఇటీవల ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో హరీవ్ రావు మాట్లాడారు. బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసి 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరో పొత్తు పెట్టుకున్నం అన్నట్లు, ఇంకెవరో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకోం అని స్పష్టం చేశారు.
Harish Rao | అధికారులకు వార్నింగ్
అధికారులకు హరీశ్రావు వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్(KTR) చెప్పినట్లు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించినా, అక్రమ కేసులు పెట్టినా, మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి అధికారుల పేర్లు రెడ్ బుక్(Red Book)లో రాసుకొని గుణపాఠం చెబుతామన్నారు.
Harish Rao | దమ్ముంటే సీసీ ఫుటేజీ బయటపెట్టాలి
సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో విఫలం అయ్యారని హరీశ్రావు విమర్శించారు. రాష్ట్ర పరువు తీశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక ఐఏఎస్ అధికారి మిస్ వరల్డ్ పోటీదారులతో (Miss World contestants) అసభ్యంగా ప్రవర్తించారని వార్తలు వస్తున్నాయన్నారు.
సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే మిస్ వరల్డ్ పోటీదారులతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని సస్పెండ్ చేయాలన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమంటే.. జిరాక్స్ కాపీ ఇచ్చి తప్పించుకున్నారని హరీశ్రావు ఆరోపించారు.