More
    HomeతెలంగాణCM Revanth | బీఆర్ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది: సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth | బీఆర్ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది: సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | రాష్ట్రంలో బీఆర్​ఎస్ (BRS)​ రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయిందని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. చనిపోయిన పార్టీని బతికించుకోవడానికి ఆ పార్టీ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికారం పోయి హరీష్‌రావు అసహనంతో మాట్లాడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.

    CM Revanth | అందుకే బీజేపీ గెలిచింది

    రాష్ట్రంలో లోక్​ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు బీఆర్ఎస్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ చేసిందని రేవంత్​రెడ్డి అన్నారు. అందుకే బీజేపీ 8 స్థానాల్లో గెలిచిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కోసం పనిచేసినందుకే మెదక్‌లో బీఆర్​ఎస్​ ఓడిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Kishan Reddy)పై సైతం సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్‌రెడ్డి కేటీఆర్‌కు లైజనింగ్ ఆఫీసరని, ప్రైవేట్​ ట్యూషన్ మాస్టర్ అని అన్నారు. కిషన్​రెడ్డి బీఆర్​ఎస్ కోసం​ పని చేస్తున్నారని ఆరోపించారు. తాను ఢిల్లీకి వెళ్లకముందే కిషన్ రెడ్డి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కేంద్ర పెద్దలతో కిషన్ రెడ్డి మాట్లాడారని ఆరోపించారు.

    READ ALSO  MP Arvind | నగరంలో కాంగ్రెస్​కు అభ్యర్థులు లేరు : ఎంపీ అర్వింద్​

    CM Revanth | ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు

    గోదావరి జలాల (Godavari Water) తరలింపునకు బీజం వేసిందే బీఆర్ఎస్ అని సీఎం ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్​లో కేసీఆర్ అందుకు ఆమోదం తెలిపారన్నారు. దీంతోనే చంద్రబాబు నాయకుడు బనకచర్ల ప్రాజెక్ట్​తో గోదావరి నీళ్లను తరలించారని చెప్పారు. చంద్రబాబు మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలని బీఆర్​ఎస్​ గెలవాలన్నా అవే కావాలని ఆయన అన్నారు. అందుకే ఈ నీటి వివాదాలు అని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గోదావరి జలాలపై రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. చర్చలకు తామే ఒక అడుగు ముందుకేస్తామని.. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. నాలుగు రోజులైనా చర్చల కోసం కూర్చోవడానికి తాము సిద్ధం అన్నారు.

    READ ALSO  CM Revanth | బీఆర్​ఎస్​ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ : సీఎం రేవంత్​రెడ్డి

    Latest articles

    Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Education System : ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...

    Operation Sindhu | ఎయిర్ స్పేస్ తెరిచిన ఇరాన్.. భారతీయుల తరలింపునకు సహకారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Operation Sindhu : ఇరాన్ (Iran) లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం(central government)...

    Health Minister | ఆరోగ్యమంత్రిని కలిసిన పీఎంపీ, ఆర్​ఎంపీలు

    అక్షరటుడే, హైదరాబాద్: Health Minister : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha)ను శుక్రవారం...

    Phone Tapping Case | బండి సంజయ్​ ఫోన్​ ట్యాపింగ్​.. వాంగ్మూలం అడిగిన అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone...

    More like this

    Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Education System : ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...

    Operation Sindhu | ఎయిర్ స్పేస్ తెరిచిన ఇరాన్.. భారతీయుల తరలింపునకు సహకారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Operation Sindhu : ఇరాన్ (Iran) లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం(central government)...

    Health Minister | ఆరోగ్యమంత్రిని కలిసిన పీఎంపీ, ఆర్​ఎంపీలు

    అక్షరటుడే, హైదరాబాద్: Health Minister : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha)ను శుక్రవారం...