అక్షరటుడే, వెబ్డెస్క్: Rajasthan | ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది సరైన విద్య అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేకపోవడం, ప్రైవేట్ బడుల్లో చదివే స్థోమత లేక చాలా మంది విద్యార్థులు (Students) అరకొర చదువులతో నెట్టుకొస్తున్నారు.
ఈ క్రమంలో తమ గ్రామంలో పిల్లలకు మంచి విద్య అందించాలని రాజస్థాన్కు చెందిన సోదరులు ఆలోచించారు. అనుకున్నదే తడువుగా పాఠశాల అభివృద్ధికి ముందుకు కదిలారు. ఇందుకోసం తమవంతు సాయంగా ఏకంగా రూ.15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇంత మొత్తంలో విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచారు ఈ సోదరులు.
Rajasthan | ఆధునిక హంగులతో పాఠశాల అభివృద్ధి
రాజస్థాన్(Rajasthan)లోని రాజ్సమంద్ జిల్లా శిశోదా గ్రామానికి చెందిన సోదరులు మేఘరాజ్-అజిత్ ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరారు. ఈ క్రమంలో తాము పుట్టిన గ్రామానికి ఏదైనా చేయాలనుకున్నారు. నగరాలకు పరిమితమైన ఉత్తమ విద్యను తమ గ్రామంలోని విద్యార్థులకు కూడా అందించడానికి చర్యలు చేపట్టారు. తమ గ్రామంలోని స్కూలు అభివృద్ధికోసం ఏకంగా రూ.15 కోట్లు అందించారు.
కాగా.. ఈ డబ్బులతో కంకుబాయి-సోహన్లాల్ ధకాడ్ kunkubayi sohanlal government school ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ను అత్యాధునికంగా తయారు చేశారు. ఆధునిక ప్రయోగశాలలు, తరగతి గదులు, సౌకర్యాలతో కార్పొరేట్ బడులకు దీటుగా తయారు చేశారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సోదరులను నెటిజెన్లు అభినందిస్తున్నారు. ఇలా ధనవంతులు తమ గ్రామాల్లో ప్రభుత్వ బడులకు చేయూత అందిస్తే ఎంతోమందికి మేలు జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/reel/DJ_ojhppPVQ/?utm_source=ig_web_copy_link