అక్షరటుడే, వెబ్డెస్క్: British Airways | ఇరాన్(Iran)పై అమెరికా దాడులు చేయడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్లోని పలు అణు స్థావరాలపై శనివారం రాత్రి అమెరికా (America) దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport)లో బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం నిలిచిపోయింది.
హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం సుమారు రెండు గంటలుగా రన్వేపైనే ఉండిపోయింది. యుద్ధం కారణంగా ఇంకా అనుమతి రాలేదని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్ – ఇజ్రాయెల్పై ప్రతిదాడులకు దిగుతోంది. అంతేగాకుండా అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులకు దిగొచ్చనే అనుమానాలున్నాయి. ఈ క్రమంలో లండన్(London)కు వెళ్లాల్సిన విమానానికి ఇంకా క్లియరెన్స్ రాలేదని సమాచారం. అయితే ప్రయాణికులు విమానంలోకి ఎక్కిన తర్వాత ఈ విషయం చెప్పడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండు గంటలుగా ఫ్లైట్లో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు.