ePaper
More
    HomeజాతీయంUttar Pradesh | చిన్న పొర‌పాటు.. కుక్క క‌ర‌వ‌డం వ‌ల‌న‌ ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల...

    Uttar Pradesh | చిన్న పొర‌పాటు.. కుక్క క‌ర‌వ‌డం వ‌ల‌న‌ ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల కబడ్డీ ప్లేయర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | కేవలం అవగాహన లేకపోవడం లేదా చిన్న విషయం అని నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక యువ క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా విషాదాన్ని కలిగించింది. 2026 ప్రో కబడ్డీ లీగ్ కోసం శిక్షణ తీసుకుంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన కబడ్డీ ప్లేయర్ (Kabaddi Player) బ్రిజేష్ సోలంకి (22), ఒక చిన్న తప్పిదంతో తన జీవితం కోల్పోయాడు. కొన్నిసార్లు చిన్న గాయ‌మే ప్రాణాంతకమవుతుంది. బ్రిజేష్ కొన్ని వారాల క్రితం ఒక కుక్కపిల్లను కాపాడే ప్రయత్నంలో, అది అతనిని కరిచింది. అయితే అది పెద్దది కాదని భావించిన బ్రిజేష్, యాంటీ-రేబిస్ టీకా(Anti-Rabies Vaccine) తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాడు.

    Uttar Pradesh | కొంప‌ముంచిన నిర్ల‌క్ష్యం

    కాలక్రమంలో అతనికి రేబిస్ లక్షణాలు (Rabies symptoms) ప్రారంభమయ్యాయి. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వైద్యం అందించినా ఫలితం లేకపోవ‌డంతో బ్రిజేష్ తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనపై సంబంధిత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక 22 ఏళ్ల యువ క్రీడాకారుడు, రాష్ట్రస్థాయి ఛాంపియన్, ఇలా మృత్యువాత పడడం ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తోంది. ఇడెన్‌బర్గ్ యూనివర్సిటీ(Edinburgh University) నివేదిక ప్రకారం, రేబిస్ ప్రపంచవ్యాప్తంగా 10వ అత్యంత ప్రమాదకర అంటువ్యాధిగా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 50,000–60,000 మంది రేబిస్ వల్ల మృతి చెందుతున్నారు.

    READ ALSO  Nagpur Railway Station | నడుస్తున్న రైలులో ఎక్కేందుకు యత్నించి పడిపోయిన యువతి.. ప్రాణాలు కాపాడిన పోలీస్​..

    భారతదేశం(India)లో ఈ కేసులు మరింత అధికంగా ఉన్నాయి. ప్రపంచ రేబిస్ మరణాల్లో 36 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏటా 17.4 మిలియన్ల కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయని, వీటిలో 18,000 – 20,000 మందికి రేబిస్ సోకుతోందని అంచనా. చిన్న కాటు అయినా తక్షణమే వైద్యులు సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ రేబిస్ టీకా తీసుకోవడం తప్పనిసరి. కేవలం కుక్కలు కాకుండా, ఎలుకలు, మేకలు, ఇతర జంతువుల గాట్లు కూడా ప్రమాదకరమే. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రేబిస్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ అంశంపై వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి అని అంటున్నారు.

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...