More
    HomeజాతీయంBridge Collapse | దేశంలో మరో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి

    Bridge Collapse | దేశంలో మరో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bridge Collapse | అహ్మ‌దాబాద్ ఎయిర్‌పోర్ట్ (Ahmedabad Airport) స‌మీపంలో విమానం కూలి (helicopter crashe) 241 మంది మరణించిన ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఇంకా ఈ ఘటనను మరిచిపోకముందే దేశంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది.

    మహారాష్ట్ర పుణే జిల్లాలోని (Maharashtra, Pune district) పింప్రి-చించ్వాడ్‌ పీఎస్‌ పరిధిలోని కుందమలలో ఇంద్రయాణి నదిపై ఉన్న వంతెన ఆదివారం కూలిపోయింది. ఈ ఘటనలో 20 నుంచి 25 మంది వరకు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లుగా స్థానిక ఎమ్మెల్యే సునీల్‌ షుల్కే మీడియాకు తెలిపారు.

    Bridge Collapse | మ‌రో విషాదం..

    ఆదివారం మధ్యాహ్నం సమయంలో వంతెన (Bridge) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం గల్లంతయిన‌ వారి కోసం గాలిస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన కుందమలకు నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇంద్రయాని నదిని (Indrayani River) దాటేందుకు అప్పట్లో వంతెనను నిర్మించారు. ఇటీవల రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వంతెన దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. వంతెన కూలిపోవడాన్ని గమనించిన కొంతమంది స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, రవాణా శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీమ్‌లు (Rescue teams) సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. సదరు వంతెన నిర్మించి దాదాపు 100 ఏళ్లకు పైగా అయ్యిందని సమాచారం.

    READ ALSO  Chinnaswamy Stadium | తొక్కిస‌లాట ఘ‌ట‌న‌తో సంచ‌లన నిర్ణ‌యం.. ఇక బెంగ‌ళూరులో మ్యాచ్‌లు లేన‌ట్టే..!

    వంతెన కూలిపోవడంతో పర్యాటకులు కొంద‌రు నదిలో పడి కొట్టుకుపోయారు. ప్రస్తుతం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ (rescue operation) చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురిని రక్షించారు. కాగా.. ఈ ఘటనలో ఎంత మంది కొట్టుకుపోయారన్న విషయంలో స్పష్టత లేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, 20-25 మంది వరకు గల్లంతై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

    ఈ ఘటనపై ఎమ్మెల్యే సునీల్‌ (MLA Sunil) మాట్లాడుతూ.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయని చెప్పారు. అంబులెన్స్‌లను సంఘటనా స్థలంలో మోహరించామని.. పర్యాటకులను కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. “ప్రమాదం అనంతరం ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది చాలా పాత వంతెన. పదేపదే అధికారులకు చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు” అంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    READ ALSO  Balochistan | పాకిస్తాన్​కు మరో షాక్​.. గ్యాస్​ పైప్​లైన్​ ధ్వంసం చేసిన బీఆర్​ఏ

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....