అక్షరటుడే, వెబ్డెస్క్ :Brahmos | భారత్ – రష్యా(India – Russia) సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణులు (Brahmos Missiles) అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదించగలవు. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులు విజయవంతంగా పలు పరీక్షలను పూర్తి చేసుకున్నాయి. ఈ సూపర్ సోనిక్ క్షిపణి ఉత్పత్తి త్వరలో లక్నో(Lucknow)లో ప్రారంభం కానుంది.
ప్రస్తుతం రష్యాలో వీటిని తయారు చేస్తున్నాయి. అయితే మేకిన్ ఇండియాలో భాగంగా భారత్లో ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో రూ.300 కోట్లతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను మే 11న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Defense Minister Rajnath Singh) ప్రారంభించనున్నపారు.
బ్రహ్మోస్ క్షిపణి తయారీ రక్షణ రంగంలో కీలక మైలురాయిగా నిలిచిపోనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదే రోజున బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రాజెక్ట్(BrahMos Aerospace Project), డిఫెన్స్ నోడ్(Defense Node)ను ప్రారంభిస్తారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021లో బ్రహ్మోస్కు 80 హెక్టార్ల భూమిని ఉచితంగా కేటాయించారు. రూ. 320 కోట్లతో మొదటి దశ పెట్టుబడి పెట్టిన ఏరోలాయ్ టెక్నాలజీకి 20 హెక్టార్ల భూమిని కేటాయించారు. ఈ సంస్థ ఉత్పత్తులను చంద్రయాన్ మిషన్, యుద్ధ విమానాలు వంటి కీలక ప్రాజెక్టులలో ఉపయోగిస్తారు.