Site icon aksharatoday.in

Brahmarushi | బ్రహ్మజ్ఞాన వైదిక పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మరుషి ఇకలేరు

Brahmarushi | బ్రహ్మజ్ఞాన వైదిక పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మరుషి ఇకలేరు

Brahmarushi | బ్రహ్మజ్ఞాన వైదిక పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మరుషి ఇకలేరు

అక్షరటుడే, ఇందూరు: Brahmarushi : నిజామాబాద్ జిల్లా (Nizamabad district) డిచ్​పల్లి స్టేషన్ (Dichpalli station) సమీపంలోని గాంధీనగర్లో గల బ్రహ్మరుషి ఆశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మరుషి (బైస పెద్ద హన్మాండ్లు)(95) సోమవారం(23-06-2025) కాలం చేశారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. బ్రహ్మరుషి ఇటీవల “బ్రహ్మజ్ఞాన వైదిక పీఠం” పేర ట్రస్టు స్థాపించి, తన కుమారులు అయిదుగురిని ట్రస్టీలుగా నియమించారు.

ఆయన భార్య కళాపరిపూర్ణ మాత తన పేరున గల సుమారు ఎకరం భూమిని ట్రస్టుకు విరాళంగా సమర్పించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, యోగా విద్య శిక్షణకు, ఏటా పది మంది నిరుపేద ఇంటర్ విద్యార్థులకు రెండేళ్ళ పాటు నెలకు రూ. 500 చొప్పున పారితోషికం ఇచ్చేలా ట్రస్టును తీర్చిదిద్దారు.

Exit mobile version