అక్షరటుడే, గాంధారి: Gandhari | తాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడుతున్నామని.. అయినప్పటికీ జీపీ సిబ్బంది పట్టంచుకోవట్లేదంటూ ఆ గ్రామ ప్రజలు పంచాయతీని ముట్టడించారు. గాంధారి మండలం బ్రాహ్మణపల్లిలో (Brahmanpalli) గ్రామస్థులు శనివారం పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
మిషన్ భగీరథ (Mission Bhagiratha) నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని.. వాన నీళ్లు తాగుతూ బతుకుతున్నామని వారు వాపోయారు. జీపీ పరిధిలో రెండు బోర్లు ఉన్నప్పటికీ అవి పాడవడంతో గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై జీపీ కార్యదర్శి సరస్వతి స్పందించి.. మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని ఈదురుగాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బోర్లు పనిచేయట్లేదన్నారు. అలాగే ఒక బోరు కూడా రిపేర్లో ఉందని రిపేర్లు చేయిస్తామని చెప్పారు.