అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | ‘ఓబీసీల పోరుబాట’ పుస్తకావిష్కరణను ఈనెల 14న నిర్వహిస్తున్నట్లు పద్మశాలి సంఘం సభ్యులు తెలిపారు. నగరంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రముఖ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి, హైకోర్టు న్యాయవాది (High Court Advocate) పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని రచించారని పేర్కొన్నారు.
ఆరేళ్లపాటు సాగిన లోతైన పరిశోధన ఆరు రాష్ట్రాల్లో జరిపిన విస్తృత అధ్యయనం, నిశిత విశ్లేషణల ఫలితమే ఈ ‘ది ఓబీసీ అప్రైజింగ్’ (The OBC Uprising) పుస్తకం అన్నారు. సమావేశంలో నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు పెంట దత్తాద్రి, కార్యదర్శి చౌటు భూమేశ్వర్, కోశాధికారి మోర సాయిలు, ఉపాధ్యక్షులు ఏనగందుల మురళి, దుబ్బ రాజాం, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు అవధూత రాములు, ఎనుగందుల సుభాష్, బూస రవి, భూష శ్రీనివాస్, కస్తూరి గంగారాజ్ తదితరులు పాల్గొన్నారు.