అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Blood Donation Camp | తలసేమియా (Thalassemia) బాధిత చిన్నారుల కోసం కామారెడ్డి పట్టణంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. వాసవి క్లబ్ బీబీపేట (Vasavi Club Bibipet), కామారెడ్డి బ్లడ్ ఓనర్స్ అసోసియేషన్ (Kamareddy Blood Owners Association), ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (International Vysya Federation) సంయుక్త ఆధ్వర్యంలోఈ శిబిరం ఏర్పాటు చేశారు. 105 మంది రక్తదానం చేసినట్లు ప్రతినిధులు తెలిపారు.
అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి (LV Prasad Eye Hospital) ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ (Department of Tourism) మాజీ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్, జైళ్ల శాఖ శాఖ డీఐజీ దుద్దెళ్ల శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కార్యదర్శి ఉప్పల సాయినాథ్, మాజీ డిప్యూటీ గవర్నర్ విశ్వప్రసాద్, తాటిపల్లి రమేష్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బా యాదగిరి, వాసవి క్లబ్ అంతర్జాతీయ కో–ఆర్డినేటర్ బాసెట్టి నాగేశ్వర్, వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.