అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh Reddy | గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆలూర్ మండల బీజేపీ నూతన ప్రధాన కార్యదర్శిగా అర్ష హరీష్కు గురువారం ఆయన నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ ఆలూర్(Aloor) మండల అధ్యక్షుడు సూర శ్రీకాంత్, తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొత్తూరు గంగాధర్, ఎస్టీ మోర్చా స్టేట్ సెక్రెటరీ మహేష్ పాల్గొన్నారు.