More
    Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు

    Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గురువారం మాచారెడ్డి (macha reddy) మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీతో పాటు ఏఐసీసీ కార్యదర్శి విష్ణు నాథన్ (AICC Secretary Vishnu Nathan), ఎంపీ సురేష్ షెట్కార్ (MP Suresh Shetkar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా అందించి రికార్డు సాధించామన్నారు. సన్న బియ్యంను పేదలకు అందించి వారి కడుపు నింపుతున్నామన్నారు.

    కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుందని బీజేపీ నాయకులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో జరిగే చిన్నచిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే స్థానిక ఎన్నికల్లో కొత్త,పాత నాయకులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ, మండల, బ్లాక్ కమిటీల ఏర్పాటుకు అందరూ సహకరించాలన్నారు. కార్యకర్తలకు బాధ్యతలు, పదవులు ఇవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

    READ ALSO  SP Rajesh Chandra | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    Shabbir Ali | కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచాం

    తెలంగాణలో ప్రభుత్వం కులగణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏఐసీసీ సెక్రెటరీ విష్ణు నాథన్ అన్నారు. గుజరాత్ (Gujarat) రాష్ట్రాన్ని దేశంలోనే రోల్ మోడల్ చేస్తానన్న మోదీ చేయలేదని, దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా చేసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) చూపించారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆహార భద్రత కార్డు(Food safety card) తీసుకువచ్చి పేదలను ఆదుకున్నారని, గిరిజనులకు దళితులకు భూములు అందించారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ రూ.71 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారని, చేనేత కార్మికులకు దేశవ్యాప్తంగా 5 వేల కోట్ల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. బీజేపీ నల్ల చట్టాలను తీసుకొచ్చి 700 రైతులు ప్రాణాలు బలిగొందన్నారు. కాంగ్రెస్​ జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

    READ ALSO  School Bus | స్కూల్ బస్సు ఢీకొని ఒకరికి గాయాలు

    Latest articles

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    More like this

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...