అక్షరటుడే, వెబ్డెస్క్ : Uttar Pradesh | లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi Gang)కు చెందిన షార్ప్ షూటర్ ఎన్కౌంటర్(Encounter)లో మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
బిష్ణోయ్ గ్యాంగ్లో షార్ప్ షూటర్గా పేరొందిన నవీన్కుమార్ (20)కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నవీన్ ఘజియాబాద్ జిల్లాకు చెందినవాడు. బిష్ణోయ్ గ్యాంగ్లో షార్ప్ షూటర్గా ఎదిగాడు. అతడిపై ఢిల్లీ, యూపీలలో హత్యా, హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీ కేసులు నమోదు అయ్యాయి.
అయితే నవీన్కుమార్ కోసం హాపుర్లో ఉత్తరప్రదేశ్ టాస్క్ఫోర్స్(UP Task Force), ఢిల్లీ పోలీసులు (Delhi Police) జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులను చూసి అతగు వారిపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Uttar Pradesh | సల్మాన్ ఖాన్కు బెదిరింపులు
బిష్ణోయ్ గ్యాంగ్ అధినేత లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయినా.. తన అనుచరులతో బయట పనులు చేయిస్తుండటం గమనార్హం. ఈ గ్యాంగ్ ఇటీవల పలుమార్లు బాలీవుడు హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)ను చంపునతామని బెదిరించింది. అంతేగాకుండా సల్మాన్ ఖాన్స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ(Baba Siddikhi)ని హత్య చేసింది. అప్పటి నుంచి ఈ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ తన అనుచరుల ద్వారా హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.