అక్షరటుడే, వెబ్డెస్క్:Balochistan | పాకిస్తాన్(Pakistan)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశాన్ని భారత్ ఇటీవల ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో కోలుకోలేని దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్లోని వ్యూహాత్మక నగరమైన సురబ్ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నగరంలో సుమారు 40 వేల జనాభా ఉంటుంది.
Balochistan | దేశాన్ని కాపాడుకోలేని పాక్..
పాకిస్తాన్ తన సొంత దేశంలో అనేక సమస్యలు ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా భారత్(India)పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం పతనావస్థలో ఉన్న భారత్పై ఉగ్రదాడులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి(Terrorists Attack) చేసి 26 మందిని బలిగొన్న విషయం తెలిసిందే.
అయితే పాకిస్తాన్ ఆర్మీ (Pakistan Army), ఐఎస్ఐ (ISI) కలిసి ఉగ్రవాదులను భారత్పై ఉసిగొల్పుతుంటే.. ఆ దేశంలోని బీఎల్ఏ (BLA) మాత్రం వారికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. బలూచిస్తాన్(Balochistan) స్వాతంత్ర్యం కోసం ఏర్పాటైన ఈ సంస్థ కొద్ది రోజులుగా పాక్ సైనికులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. తాజాగా సురభ్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలోని తమ నగరాన్ని కాపాడుకోలేని పాక్ భారత్పైకి కయ్యానికి కాలు దువ్వుతుండటం గమనార్హం.
Balochistan | ప్రభుత్వ భవనాలకు నిప్పు
పాకిస్తాన్లోని సురభ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్ఏ పోలీస్ స్టేషన్లు(Police Stations), ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టింది. ప్రధాన బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, ఇతర కీలక ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా క్వెట్టా-కరాచీ హైవే(Quetta-Karachi Highway)పై తనిఖీలు కూడా చేపడుతోంది. దీంతో బీఎల్ఏ రెచ్చిపోతుండటంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏం చేయాలో తోచడం లేదు.
Balochistan | స్వాతంత్ర్య బలూచిస్తానే లక్ష్యంగా..
స్వాతంత్ర్య బలూచిస్తానే లక్ష్యంగా బీఎల్ఏ ఏర్పాటు అయింది. అయితే గతంలో బీఎల్ఏపై పాక్ ప్రభుత్వం (Pakistan Government) అనేక నిర్బంధాలు అమలు చేసింది. ఇటీవల బలంగా తయారైన బీఎల్ఏ పాక్ ఆర్మీకి చుక్కలు చూపెడుతోంది. కొద్ది రోజుల క్రితం బలూచిస్తాన్లోని మంగుచోర్ పట్టాణాన్ని స్వాధీనం చేసుకున్న బీఎల్ఏ, తాజాగా సురభ్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే భారత్ దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన పాక్ బీఎల్ఏ దాడులతో అతలాకుతలం అవుతోంది. తన నగరాలను కాపాడుకోలేని స్థితిలో ఉన్న పాక్ సైనం కశ్మీర్ గురించి మాట్లాడుతుండటం గమనార్హం.