అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bhubharathi | భూభారతి దరఖాస్తుల డెస్క్వర్క్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం లింగంపేట్ తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి సర్వే డెస్క్ (BhuBharati Survey Desk) పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగంపేటలో పైలెట్ ప్రాజెక్టుగా (Pilot project in Lingampeta) చేపట్టిన భూభారతి సర్వే చివరిదశకు చేరుకుందన్నారు. మండలంలోని 25 గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి 4,225 దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. వీటిలో 4,100 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. డెస్క్వర్క్ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ మన్నే ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.