అక్షరటుడే, కోటగిరి: Indiramma Housing Scheme | పోతంగల్ మండలంలోని హంగర్గ ఫారంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) శుక్రవారం భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu), ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజు(Agro Industry Chairman Kasula Balaraju), బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato), ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, తహశీల్దార్ గంగాధర్, ఎంపీడీవో, చందర్, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, మండలాధ్యక్షులు పుప్పాల శంకర్, ఏజాజ్ ఖాన్, కొట్టం మనోహర్, గంధపు పవన్ తదితరులున్నారు. అనంతరం కోటగిరిలో మండల కేంద్రంలోని ఇందిరమ్మ మోడల్ ఇల్లు ఎమ్మెల్యే పోచారం, కలెక్టర్, అగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్తో కలిసి ప్రారంభించారు.