అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Collector Ashish Sangwan | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం లింగాపూర్లో (Lingapoor) కుంట్ల వినోద అనే లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. పట్టణంలో 708 ఇళ్లు మంజూరు కాగా, 74 ఇళ్లకు ముగ్గు వేసినట్లు తెలిపారు. అలాగే జిల్లాలో రెండుదశల్లో 11,153 ఇళ్లు మంజూరైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, హౌసింగ్ పీడీ విజయ్పాల్ రెడ్డి, లబ్ధిదారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Collector Ashish Sangwan | లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి
Published on
