అక్షర టుడే, నిజాంసాగర్: Cyber crimes | ఇటీవల సైబర్ నేరాలు cyber crimes పెరిగిపోయాయని, అనవసర లింక్, మెసేజ్లకు స్పందించవద్దని ఎస్సై మహేందర్ sub-Inspector mahender అన్నారు. ఆదివారం పెద్దకొడప్గల్ మండలంలోని peddakodapgal mandal అంజని చౌరస్తా 161హైవేపై వాహనదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు two-wheeler riders హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు traffic rules పాటించాలని సూచించారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు వెంకటేష్, అంజి, రమేష్ ఉన్నారు.
