అక్షరటుడే, వెబ్డెస్క్:Weather | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గత మూడు రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదు అవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా సాయంత్రం పూట వర్షాలు పడుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.రానున్న రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరించింది.
ఎండల తీవ్రత అధికంగా ఉండనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వడగాలులు వీస్తాయని, ప్రజలు మధ్యాహ్నం పూట ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్(Hyderabad)లో 42డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.