అక్షరటుడే, వెబ్డెస్క్: BCCI | పహల్గామ్ ఉగ్రదాడి Pahalgam terror attack నేపథ్యంలో బీసీసీఐ BCCI కీలక ప్రకటన చేసింది. జమ్మూ కశ్మీర్లోని Jammu Kashmir పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి 28 మందిని హతమార్చిన విషయం తెలిసిందే.
కాగా ఈ దాడి వెనుక పాకిస్తాన్ pakistan పాత్ర ఉందని భారత ప్రభుత్వం పేర్కొంది. దీంతో భవిష్యత్లో పాకిస్తాన్తో ఎలాంటి ద్వైపాక్షిక మ్యాచ్లు బీసీసీఐ ఉండవని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇండియా, పాక్ pak ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు. ఇండియన్ టీం కూడా పాక్కు వెళ్లడం లేదు.
ఐసీసీ icc టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. తాజా ఉగ్రదాడి అనంతరం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల bcci vice president rajiv shukla మాట్లాడుతూ. భవిష్యత్తులో కూడా పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఐసీసీ indian cricket council కారణంగానే ప్రస్తుతం పాక్తో తటస్థ వేదికల్లో మ్యాచ్లు ఆడుతున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడేం జరుగుతుందో ఐసీసీకి అవగాహన ఉందనుకుంటున్నామని ఆయన తెలిపారు.