More
    Homeక్రీడలుTerror Attack | భారత్ Vs పాక్ మ్యాచ్‌లపై బీసీసీఐ సంచలన నిర్ణయం!

    Terror Attack | భారత్ Vs పాక్ మ్యాచ్‌లపై బీసీసీఐ సంచలన నిర్ణయం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఇండియా, పాక్​ మధ్య క్రికెట్​ మ్యాచ్​ అంటే అభిమానులు ఎంతో ఉత్కంఠతో చూసేవారు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్​, పాక్​ తలపడుతున్నాయి. ఇక అలాంటి మ్యాచ్​లు ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌ Jammu Kashmirలోని పహల్గామ్‌ pahalgamలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాయాదీ పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్ cricket మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు Bilateral series జరగడం లేదు. కేవలం ఐసీసీ ICC, ఏసీసీ ACC టోర్నీల్లో మాత్రమే దాయాదీ దేశాలు తలపడుతున్నాయి.

    READ ALSO  IND vs ENG | పంత్‌కు దండాలు పెట్టిన కేఎల్ రాహుల్‌.. ఎందుకో తెలుసా..!

    ఇక నుంచి ఆ మ్యాచ్‌లు కూడా ఆడవద్దని బీసీసీఐ BCCI నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐసీసీ ICCకి లేఖ రాసినట్లు కూడా ప్రముఖ క్రికెట్ వె‌బ్‌సైట్స్ పేర్కొన్నాయి. గత మంగళవారం(ఏప్రిల్ 22) జరిగిన ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యావత్ దేశం భగ్గుమంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధిస్తూ పరోక్ష యుద్దానికి తెరలేపింది. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా ఆ దేశానికి గుణపాఠం చెప్పాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(PSL)కు సంబంధించిన భారత ప్రసారాలను బ్రాడ్‌కాస్టర్స్‌ నిలిపివేశాయి.

    ‘పహల్గామ్‌ ఉగ్రదాడి Pahalgam terror attack తర్వాత బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జరిగే ఐసీసీ ఈవెంట్లలో భారత్ bharat, పాకిస్థాన్‌ pakistanలను ఒకే గ్రూపులో ఉంచవద్దని కోరుతూ బీసీసీఐ.. ఐసీసీకి లేఖ రాసింది. ఐసీసీ ఈవెంట్స్‌లో కూడా పాక్‌తో ఆడవవద్దని బీసీసీఐ భావిస్తోంది.’అని క్రిక్‌బజ్ తమ నివేదికలో పేర్కొంది. బీసీసీఐ డిమాండ్ ను ఐసీసీ అంగీకరిస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు PCB ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లనుంది. పీసీబీతో పాటు బ్రాడ్‌కాస్టర్స్ కూడా తీవ్రంగా నష్టపోనున్నాయి. ఈ ఏడాది భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ womenrs oneday world cup జరగనుంది. ఈ టోర్నీలో భారత్-పాక్ తలపడాల్సి ఉంది. మరీ ఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

    READ ALSO  India - England Match | భార‌త్‌కు ధీటుగా స‌మాధానం ఇస్తున్న ఇంగ్లండ్.. అంతా జ‌డేజా వల్లనే..!

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...