More
    Homeక్రీడలుBCCI | విక్ట‌రీ సెల‌బ్రేష‌న్స్ కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు.. త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేసిన బీసీసీఐ

    BCCI | విక్ట‌రీ సెల‌బ్రేష‌న్స్ కోసం మార్గ‌ద‌ర్శ‌కాలు.. త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేసిన బీసీసీఐ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BCCI | ఐపీఎల్ 2025లో ఆర్సీబీ(RCB) విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన సెల‌బ్రేష‌న్స్ కార్య‌క్ర‌మంలో తొక్కిసలాట(Stampede) జరిగి చాలా మందే మృతి చెందారు. ఈ ఘటనపై బీసీసీఐ(BCCI) తీవ్రంగా స్పందించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు మరొకసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు, ఐపీఎల్ కార్యక్రమాల సమయంలో భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు బోర్డు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ ట్రోఫీ(IPL Trophy) గెలుపు సంబురాల్లో తొక్కిస‌లాట‌లు జ‌ర‌గ‌కుండా చూడ‌డం కోసం.. అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు చేసేందుకు త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసింది. బీసీసీఐ సెక్రెట‌రీ దేవ‌జిత్ సైకియా (Devjit Saikia) అధ్య‌క్షుడిగా ఉన్న ఈ క‌మిటీలో ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ప్ర‌భ్ తేజ్ సింగ్ భాటియా స‌భ్యులుగా ఉన్నారు.

    BCCI | త్రిస‌భ్య క‌మిటీ..

    ఆర్సీబీ విక్ట‌రీ సెల‌బ్రేష‌న్స్ స‌మ‌యంలో బెంగ‌ళూరులో జ‌రిగిన తొక్కిస‌లాట(Bengaluru Stamped) మ‌మ్మ‌ల్ని ఎంతో క‌లిచి వేసింది. ఈ ఘ‌ట‌న నిజంగా దుర‌దృష్ట‌క‌రం. భ‌విష్య‌త్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా చూడాల‌ని బీసీసీఐ భావించింది. అందుకే.. త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేశాం. ఆ క‌మిటీ త్వ‌ర‌లోనే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేస్తుంది అని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో ఆర్సీబీ విజేత‌గా నిల‌వ‌డంతో క‌ర్నాట‌క ప్ర‌భుత్వం(Karnataka Government) విక్ట‌రీ ప‌రేడ్‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హిచింది. జూన్ 3న చిన్న‌స్వామి స్టేడియంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మానికి సీఎం సిద్ధ‌రామ‌య్య‌, ఉప‌ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌లు హాజ‌రై బెంగ‌ళూరు ఆట‌గాళ్ల‌ను స‌న్మానించారు.

    READ ALSO  RCB | ఐపీఎల్ విజేత కాగానే ఆర్సీబీ కొత్త నిర్ణ‌యం.. అమ్మకానికి పెట్ట‌బోతున్నారా..?

    ఈ కార్య‌క్ర‌మాన్ని చూసేందుకు స్టేడియానికి అభిమానులు భారీగా పోటెత్త‌డంతో వారిని అదుపు చేయ‌డంలో పోలీసులు విఫ‌లం అయ్యారు. 35 వేల మంది సామ‌ర్ధ్య‌మే ఉన్న స్టేడియంలోకి ల‌క్ష మందికి పైగా అభిమానులను పంప‌డంలో నిర్వాహ‌కులు స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక‌తో లేరు. గేట్ నంబ‌ర్ 2, 2ఏ, 6, 7, 15, 17, 18, 20, 21 నంబ‌ర్ గేట్ల వ‌ధ్య తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 56 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆర్సీబీ ఫ్రాంచైజీ సోష‌ల్ మీడియాలో అంద‌రికి ప్ర‌వేశం ఉచితం అని పోస్ట్ పెట్ట‌డంతోనే అభిమానులు అంత‌గా వ‌చ్చారు. అందువ‌ల్లే తొక్కిస‌లాట జ‌రిగింది’ అని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. తొక్కిస‌లాట‌లో మ‌ర‌ణించిన వాళ్ల కుటుంబాల‌కు ఆర్సీబీ యాజ‌మాన్యం రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది. క‌ర్నాట‌క ప్ర‌భుత్వం, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) సైతం బాధిత కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని తెలిపారు.

    READ ALSO  Chinnaswamy Stadium | తొక్కిస‌లాట ఘ‌ట‌న‌తో సంచ‌లన నిర్ణ‌యం.. ఇక బెంగ‌ళూరులో మ్యాచ్‌లు లేన‌ట్టే..!

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....