అక్షరటుడే, బాన్సువాడ: Mahatma Basaveshwara| మహాత్మా బసవేశ్వరుడు అందరికీ ఆదర్శప్రాయుడని బిచ్కుంద పీఠాధిపతి సద్గురు సోమలింగ శివాచార్యస్వామీజీ (Bichkunda Peethadipathi is Sadguru Somalinga Shivacharya Swamiji.) అన్నారు.
శుక్రవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో మహాత్మ బసవేశ్వర విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బసవేశ్వరుని ఆదర్శంగా తీసుకొని కులమతాలకతీతంగా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ విభూతి ధరించాలని, లింగ పూజ చేయాలని సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు దేవేందర్, హన్మాండ్లు, అంజు, డెగ్లూర్ శంకర్, మల్లికార్జున్, సంగప్ప, భాస్కర్, లింగం, శంకర్, జాయి సుదీప్, శ్యాం, గంగాధర్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.