అక్షరటుడే, వెబ్డెస్క్: ICICI Bank | ఇంట్లో డబ్బులు పెడితే దొంగల భయం.. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దామంటే రిస్క్ ఉంటుందనే ఆందోళన. దీంతో చాలా మంది తమ డబ్బులను బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposit) చేసుకుంటారు. ఇలా అయితే తమ డబ్బులు భద్రంగా ఉంటాయని భావిస్తారు. కానీ కొందరు బ్యాంకు అధికారుల(Bank officers) తీరుతో ఖాతాదారుల డబ్బుకు భద్రత లేకుండా పోయింది. బ్యాంక్లోని ఖాతాదారుల డబ్బులను రక్షించాల్సిన అధికారులే.. గుట్టు చప్పుడు కాకుండా వాటిని నొక్కేస్తున్నారు. ఇలా బ్యాంకు నుంచి రూ.4.58 కోట్లు కాజేసిన ఓ అధికారిణిని పోలీసులు అరెస్ట్(Police Arrest) చేశారు.
ICICI Bank | స్టాక్ మార్కెట్లో నష్టపోవడంతో..
రాజస్థాన్(Rajasthan)లోని ఐసీఐసీఐ బ్యాంక్లో సాక్షి గుప్తా రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తోంది. ఆమె స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి భారీగా లాభాలు గడించాలని ఆశించింది. అందుకోసం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఖాతాదారుల నగదు వాడుకుంది. 40 మందికిపైగా కస్టమర్లకు చెందిన రూ.4.58 కోట్లను అక్రమంగా వాడుకుంది. ఆ డబ్బును స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయగా.. నష్టం వచ్చింది. దీంతో ఆ డబ్బును తిరిగి జమ చేయలేకపోయింది. ఓ వ్యక్తి తన ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposit) గురించి ఆరా తీయడానికి బ్యాంకుకు వెళ్లగా ఈ స్కామ్ వెలుగు చూసింది. దీంతో బ్యాంకు అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.