అక్షరటుడే, వెబ్డెస్క్ : Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్కు గురైన వారి స్టేట్మెంట్లను కూడా రికార్డు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆయనకు సిట్ అధికారులు ఫోన్ చేశారు. నోటీసులు ఇచ్చి.. సమయం ఇస్తే వాంగ్మూలం తీసుకుంటామని కోరారు. కాగా.. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్రావు స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్కు గురైన అందరి వాంగ్మూలం సేకరించి నివేదిక ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.