అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం బక్రీద్ (Bakrid) సందర్భంగా ఆర్డీవో కార్యాలయం (RDO Ofiice) సమీపంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆర్డీవో వీణ, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), మున్సిపల్ కమిషనర్ రాజేందర్ షబ్బీర్ అలీకి(Municipal Commissioner Rajender) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. త్యాగాల ద్వారా వచ్చిన ప్రయోజనాలు ప్రజలకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత అని బక్రీద్ బోధిస్తుందన్నారు. సకల మతవిశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రంలో దేశంలో పాలన కొనసాగాలని పేర్కొన్నారు.
Shabbir Ali | ఉగ్రవాదానికి కులం మతం లేదు
ఉగ్రవాదానికి మతం, కులం లేదని షబ్బీర్ అలీ అన్నారు. టెర్రరిస్టు దాడులు జరిగితే ఓ వర్గానికి ఆపాదించడం సరికాదన్నారు. ఆపరేషన్ సిందూర్కు కల్నల్ సోఫియా నాయకత్వం వహించి దేశం దృష్టిని ఆకర్షించిందన్నారు. ఏ మతానికి టెర్రరిజాన్ని ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు.