అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాద్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కల్తీకల్లు తయారీ కోసం వినియోగించే అల్ప్రాజోలంను కట్టడి చేసేందుకు గట్టి నిఘా ఉంచాలన్నారు.
Nizamabad Collector | అవగాహన కార్యక్రమాలు..
క్లోరోఫామ్ (Chloroform), డైజోఫామ్ (diazoform), అల్ప్రాజోలం (alfrazolum) వంటి వాటిని వినియోగిస్తూ తయారుచేసిన కల్లును తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారని వివరించారు. కొంతమంది గర్భిణులు కూడా తాగుతున్నారన్నారు. కావున గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.
Nizamabad Collector | టోల్ ఫ్రీ నంబరు..
మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1908కు ఫోన్ చేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్, జిల్లా వ్యవసాయాధికారి వీరస్వామి, డీఎఫ్వో సుధాకర్, డీటీవో ఉమామహేశ్వరరావు, ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.