అక్షరటుడే, ఎల్లారెడ్డి:Yellareddy | ఆటో, మోపెడ్ వాహనాలు ఢీకొన్న ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. ఎల్లారెడ్డి నుంచి రుద్రారం వైపు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ఆటోను టీవీఎస్ మోపెడ్ (TVS moped) వాహనం ఢీకొంది.
ఈ క్రమంలో ఆటో(Auto) బోల్తా పడగా, అందులో ప్రయాణిస్తున్న ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన షేర్ల చంద్రయ్య, శకుంతల, లక్ష్మి, బ్రాహ్మణపల్లికి చెందిన గంగవ్వ, నిజాంసాగర్ మండలంలోని బంజపల్లికి చెందిన రజిత, సుమలత, చిన్నారి అభినయకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రి(Government hospital)కి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న మున్సిపల్ మాజీ ఛైర్మన్ సత్యనారాయణ (Former municipal chairman Satyanarayana) ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ను కలిసి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.