అక్షరటుడే, వెబ్డెస్క్: Siddipet | సమాజంలో రోజురోజుకు నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. డబ్బు, ప్రేమ, వివాహేతర సంబంధాల మోజులో చాలా మంది కన్న వారిని, కట్టుకున్న వారికి కూడా కడ తేరుస్తున్నారు. కొందరైతే కడుపున పుట్టిన పిల్లలను చంపేస్తారు. తాజాగా ఓ వ్యక్తి ఇన్సూరెన్స్(Insurance) డబ్బుల కోసం అత్తను హత్య చేయించాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు మామలు ఆ అల్లుడి ఆట కట్టించారు.
సిద్దిపేట జిల్లా (Siddipet District) తొగుట మండలం తుక్కాపూర్కు చెందిన వెంకటేశ్ పౌల్ట్రీ ఫామ్ (Poultry Farm) పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయాడు. ఈ క్రమంలో తన అత్త రామవ్వను చంపి, అది ప్రమాదం చిత్రీకరించాలని చూశాడు.
ఈ మేరకు ఆమెపై ముందుగానే రైతు బీమా (Farmers Insurance), పోస్టల్ ఇన్సూరెన్స్ (Postal Insurance), ఎస్బీఐ ఇన్సూరెన్స్ (SBI Insurance) చేయించాడు. అనంతరం ఈ నెల 7న పొలం పని ఉందని చెప్పి అత్తను తీసుకు వెళ్లి కారుతో గుద్దించి హత్య చేశాడు. అనంతరం గుర్తు తెలియని కారు ఢీకొందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Siddipet | దృశ్యం సినిమా చూసి..
వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా వెంకటేశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన అత్త పేరిట ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కరుణాకర్ అనే వ్యక్తికి వెంకటేశ్ రూ.1.50 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. దృశ్యం సినిమా చూసి హత్యకు ప్లాన్ వేసినట్లు నిందితుడు చెప్పాడని సిద్దిపేట సీపీ అనురాధ(Siddipet CP Anuradha) తెలిపారు. ఈ మేరకు నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేశారు.