అక్షరటుడే, వెబ్డెస్క్ :Election Counting | నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్(Election Counting) ప్రక్రియ ప్రారంభమైంది. బెంగాల్(Bengal), పంజాబ్(Punjab), కేరళ(Kerala), గుజరాత్(Gujarat)లో ఐదు అసెంబ్లీ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరిగాయి. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. గుజరాత్లోని విసావదర్, కడి స్థానాలతో పాటు పంజాబ్లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబూరు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
