అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. సీతారాంనగర్ కాలనీ, ఆనంద్నగర్ ఆర్యవైశ్య హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం గుజరాత్భవన్లో ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో, సంపద సృష్టించడంలో ముందంజలో ఉన్న ఆర్యవైశ్యులు రాజకీయాల్లోనూ ముందుండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ (EWS Reservation) తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రతినిధులు కట్కం చిరంజీవి, రాజేందర్, రాజు, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.