అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Home Minister Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా జిల్లా పర్యటనకు వస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సీపీ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్షా నగరంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయం (National Turmeric Board Office) ప్రారంభోత్సవం చేస్తారన్నారు. అనంతరం బైపాస్ చౌరస్తాలో డీఎస్ విగ్రహాన్ని (DS statue) ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్లో (Polytechnic Ground) రైతుసభలో పాల్గొంటారని వివరించారు.
Home Minister Amit Shah | ట్రాఫిక్ సమస్య తలెత్తవద్దు..
పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే సభకు ట్రాఫిక్ ఇబ్బందుల రాకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక హెలీకాప్టర్లో ఆయన జిల్లాకు వస్తున్నందున కలెక్టరేట్లో హెలీప్యాడ్ సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. ఎక్కడా కూడా లోటుపాట్లకు తావులేకుండా పర్యటకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రతాపరంగా సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.