అక్షరటుడే, వెబ్డెస్క్ : Rakesh Reddy | ఆర్మూర్ ఎమ్మెల్యే armoor mla పైడి రాకేశ్రెడ్డి paidi rakesh reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు hindus కుటుంబ నియంత్రణ పాటించొద్దని కోరారు.
జక్రాన్పల్లి jakranpalli మండలం మనోహరాబాద్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడారు. “హిందువులు వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని.. ధర్మాన్ని కాపాడుకోకపోతే మనం ఆగం అవుతామని” ఆయన వ్యాఖ్యానించారు. ధర్మాన్ని కాపాడుకోవాలంటే మన(హిందువుల) సంఖ్య పెరగాలని చెప్పారు. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రతగా ఉంటుందని.. దేశం, ధర్మం లేకుంటే భవిష్యత్తు ఉండదని రాకేశ్రెడ్డి అన్నారు.
Rakesh Reddy | ఆస్తులు ఆక్రమించుకుంటారు..
కశ్మీర్లో kashmir attack ఉగ్రవాదులు మతం అడిగి మరి హిందువులను చంపారని, మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు కష్టపడి సంపాదించిన ఆస్తులు ఇతరులు ఆక్రమించుకుంటారని చెప్పారు. కశ్మీర్లో ఎందరో తమ ఆస్తులను వదిలేసి పారిపోయారని, మన దగ్గర కూడా అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందన్నారు.
Rakesh Reddy | రైతులు కలిసి మెలిసి ఉండాలి
రైతులు farmers పార్టీలకతీతంగా తమ సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడాలని సూచించారు. అన్నదాతలు వ్యాపార రంగంలోకి వెళ్లాలన్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి లాభాలు సాధించాని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికా పంపుతున్నారని, కానీ అక్కడ వారు అనేక కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ట్రంప్ అధికారంలోకి రావడంతో అమెరికాలోని అనేక మంది విద్యార్థులు భయపడుతున్నారని చెప్పారు.