అక్షరటుడే, ఆర్మూర్ : Mla Prashanth Reddy | అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి రైతులు ఆగమవుతున్నారని.. కానీ సీఎం రేవంత్రెడ్డికి (CM Revanth Reddy)అందాల పోటీలే ముఖ్యమయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో (Balkonda Constituency) కల్లాల వద్ద, రహదారులపై ఇప్పటికీ ధాన్యం రాశులు కుప్పలుగా ఉన్నాయని.. అయినా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. వారి నిర్లక్ష్యంతోనే ధాన్యం వర్షం పాలవుతోందన్నారు. ధాన్యం సేకరణపై రివ్యూ చేయని సీఎం రేవంత్రెడ్డి అందాలపోటీలపై ఇప్పటికీ ఎనిమిది సార్లు రివ్యూ చేశారని విమర్శించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
