అక్షరటుడే, ఇందూరు: Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి భారత్ ధీటైన జవాబునిచ్చింది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భీకరమైన వైమానిక దాడులు చేసి పలువురిని మట్టుబెట్టింది. ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ ఘటనపై మాజీ సైనికులు, అగ్నివీరులు, ఎన్సీసీ అధికారులు తమ అభిప్రాయాన్ని ‘అక్షరటుడే’(Akshara Today)తో పంచుకున్నారు.
Operation Sindoor | అవకాశం ఉంటే మళ్లీ యుద్ధం చేస్తా..

– హర ప్రసాద్, సైనిక సంక్షేమ సంఘం, మాజీ జిల్లా అధ్యక్షుడు
పహల్గామ్లో పర్యాటకులపై(Tourists) ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రదాడిపై భారత ఆర్మీ(Indian Army) ధీటుగా స్పందించింది. పాకిస్థాన్ పౌరులను కాకుండా ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా దాడికి దిగింది. అవకాశం ఉంటే మళ్లీ యుద్ధంలో పాల్గొనాలని ఉంది. గతంలో నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force)లో విధులు నిర్వహిస్తూ.. కార్గిల్ యుద్ధం(Kargil War)లో పాల్గొన్నాను.
Operation Sindoor | ఉగ్రవాదులకు ఇది చావుదెబ్బ

– మధుసూదన్, రిటైర్డ్ ఆర్మీ
పహల్గామ్ ఉగ్రదాడితో భారత సైన్యం సరైన పనిచేసింది. పాకిస్థాన్(Pakistan)లోని ఉగ్రవాద స్థావరాలకు ఇది చావుదెబ్బ. భారత సైన్యం(Indian Army) తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. అప్పుడు సర్జికల్ స్ట్రైక్(Surgical strike).. ఇప్పుడు ఆపరేషన్స్ సిందూర్(Operations Sindoor)తో కోలుకోలేని దెబ్బతీసింది. ఉగ్రవాదులు భారత్ చేతుల్లో నుంచి తప్పించుకోలేరు.
Operation Sindoor | పహల్గామ్ మృతులకు నిజమైన నివాళి

– శివ, అగ్నివీర్ సైనికుడు
మన సైన్యం చాలా బలంగా ఉంది. భారత్(India)ను ఎదుర్కొనే బలం పాకిస్థాన్కు లేదు. పహల్గామ్ పర్యాటక మృతులకు ఇది నిజమైన నివాళి. అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకోడానికి త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి.
Operation Sindoor | కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సరైన సమయం

– లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఎన్సీసీ అధికారి
పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఇదే సరైన సమయం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు మన సైన్యం మంచి జవాబునిచ్చింది. శత్రు రాజ్యాలకు కూడా హెచ్చరించిన వాళ్లమయ్యాం. యుద్ధం చేసైనా పీవోకే(POK)ను స్వాధీనం చేసుకోవాలి.