అక్షరటుడే, వెబ్డెస్క్: Un Academy | నగరంలోని అన్ అకాడమీ విద్యాసంస్థలో బుధవారం యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ తిరుమలగిరి (Inspector Tirumalagiri) మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు. అలాగే 100 డయల్, ఇతర చట్టాలపై వివరించారు.
విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వివరించారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు వాటివల్ల కలిగే దుష్ప్రరిణామాలను విద్యాసంస్థల్లోనూ వివరించాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్సై రమాదేవి, కళాశాల మేనేజ్ మెంట్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.