అక్షరటుడే, వెబ్డెస్క్ :Phone Tapping Case | తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులతో పాటు జడ్జీలు, సినీ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్(Phone Tapping)కు గురయ్యాయని ప్రభుత్వం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం సిట్ను కూడా ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు(Sit Officers) ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు(Former SIB chief Prabhakar Rao)ను విచారిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
తన ఫోన్లు కూడా ట్యాప్ చేశారని షర్మిల(Congress AP President YS Sharmila) ఆరోపించారు. ఎన్నికలకు ముందు షర్మిల వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టి తెలంగాణలో పలు కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్(Hyderabad)లోనే తన ఫోన్లు ట్యాప్ చేశారంటూ షర్మిల ఆరోపణలు చేశారు. తను ఎవరెవరితో మాట్లాడుతున్నారన్నది ఎప్పటికప్పుడు జగన్(YS Jagan)కు చేరవేశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.మరోవైపు షర్మిల ఫోన్ ట్యాప్ చేసి ప్రభాకర్రావు టీమ్ కోడ్ లాంగ్వేజ్(Team code language) వాడినట్లు సమాచారం. ట్యాపింగ్ చేస్తున్నట్లు గుర్తించి వ్యక్తిగత ఫోన్లను మార్చినట్లు ఆమె తెలిపారు.