More
    HomeజాతీయంEncounter | మావోయిస్టులకు మరో షాక్​.. ఎన్​కౌంటర్​లో నలుగురి మృతి

    Encounter | మావోయిస్టులకు మరో షాక్​.. ఎన్​కౌంటర్​లో నలుగురి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | మావోయిస్టులకు మరో షాక్​ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్​గఢ్ (Chhattisgarh)​లో వరుస ఎన్​కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు (Maoists) మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో కీలక నేతలు సైతం హతమయ్యారు. తాజాగా మధ్యప్రదేశ్​ (Madhya Pradesh)లో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు నక్సల్స్​ చనిపోయారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం.

    మధ్యప్రదేశ్​లోని బాలాఘాట్ జిల్లాలోని అడవుల్లో శనివారం భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్​ చేపట్టారు. మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు పెద్ద సంఖ్యలో బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ (Search Operation)లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో పచ్మదార్, కటేజిరియా అటవీ ప్రాంతాలలో ఎన్‌కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోల కోసం ఇంకా సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతూనే ఉంది.

    READ ALSO  Sangareddy | టిప్పర్​కు కరెంట్​​ షాక్​.. డ్రైవర్​ సజీవ దహనం

    Encounter | బలగాలను అభినందించిన సీఎం

    మధ్యప్రదేశ్​లో జరిగిన ఎన్​కౌంటర్​ ఆ రాష్ట్ర సీఎం మోహన్​ యాదవ్​ (CM Mohan Yadav) ఎక్స్​ వేదికగా స్పందించారు. దేశంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో మధ్యప్రదేశ్​ ఒక మైలు రాయి అని అన్నారు. ఈ ఆపరేషన్​ విజయవంతం అయిందని ప్రకటించారు. ఘటన స్థలంలో గ్రెనేడ్ లాంచర్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (SLR), రెండు 315 బోర్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్​లో పాల్గొన్న జవాన్లు, పోలీసు అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. భద్రతా దళాల ధైర్యం, నిబద్ధతను సీఎం యాదవ్ ప్రశంసించారు.

    Encounter | కీలక నేతలు హతం

    ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్లలో మావోయిస్ట్​ కీలక నేతలు హతం అయ్యారు. ఓ వైపు క్యాడర్​, మరోవైపు అగ్రనేతలను కోల్పోతుండటంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు. నంబాల కేశవరావు, సుధాకర్​, భాస్కర్​ లాంటి కీలక నేతలు ఇటీవల మరణించారు. ఈ క్రమంలో తమ ఉనికి చాటుకోవడానికి మావోలు దాడులకు పాల్పడుతున్నారు.

    READ ALSO  MUDA Scam | సీఎం సిద్ధరామయ్యకు షాక్​.. ముడా స్కామ్​లో ఈడీ దూకుడు.. 92 ప్లాట్ల అటాచ్​

    ఇందులో భాగంగా ఇటీవల ఛత్తీస్​గఢ్​లోని మావోయిస్ట్​ అగ్రనేత హిడ్మా స్వగ్రామంలో ఓ వ్యక్తిని ఇన్​ఫార్మర్​ నెపంతో హత్య చేశారు. అంతేగాకుండా ఓ ట్రక్కును సైతం కాలబెట్టారు. అనంతరం కూంబింగ్​కు వెళ్తున్న పోలీస్​ వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఛత్తీస్​గఢ్​ సుక్మా (sukma) జిల్లాలో ఈ పోలీస్​ వాహనాన్ని మావోలు పేల్చేయగా ఏఎస్పీ ఆకాశ్​రావు మృతి చెందారు. పలువురు సిబ్బంది గాయపడ్డారు. మొన్నటి వరకు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పిన మావోలు తాజాగా పంథా మార్చి దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు మృతి చెందడం గమనార్హం.

    Latest articles

    Yoga | యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga | యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతాం. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాలు...

    Yoga | యోగాకు ముందు సూక్ష్మ వ్యాయామం తప్పనిసరి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exercise | యోగా(Yoga) సాధన శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత ఇస్తుంది. నిత్యం యోగా చేస్తే...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 15 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – జ్యేష్ఠపక్షం...

    US Army Day | యూఎస్​ ఆర్మీ డే వేడుకలు.. పాక్​ ఆర్మీ చీఫ్​ను ఆహ్వానించలేదని ప్రకటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US Army Day : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్(Pakistan Army Chief...

    More like this

    Yoga | యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga | యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతాం. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాలు...

    Yoga | యోగాకు ముందు సూక్ష్మ వ్యాయామం తప్పనిసరి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exercise | యోగా(Yoga) సాధన శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత ఇస్తుంది. నిత్యం యోగా చేస్తే...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 15 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – జ్యేష్ఠపక్షం...