అక్షరటుడే, వెబ్డెస్క్ : Air India |మరో విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) ఘటన మరువకముందే మరో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి 270మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఎయిర్ ఇండియా (Air India) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) నుంచి కోల్కతా (Kolkara) వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఘజియాబాద్లోని హిండన్ విమానాశ్రయం నుంచి బయలుదేరే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్ వే పైనే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాన్ని పైలెట్ నిలిపివేశారు. దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యంగా నడిచినట్లు సంస్థ తెలిపింది. ప్రయాణికులకు ఉచిత రీషెడ్యూలింగ్, టికెట్ రద్దు చేసుకుంటే.. పూర్తి డబ్బులు వాపస్ ఇస్తామని ప్రకటించింది.
కాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎంతో మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఫ్లైట్లో ఉన్న 242 మంది ఒకరు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. మిగతా వారు అందరు మరణించారు. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని విద్యార్థులు సైతం చనిపోయారు.