అక్షరటుడే, వెబ్డెస్క్: Cyprus | సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి ఆ దేశం అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్(Cyprus President Nikos Christodoulides) చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ తొలి అధ్యక్షుడు మకరియోస్ 3 పేరుతో ఈ అత్యున్నత పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి సైప్రస్లో పర్యటిస్తున్న భారత ప్రధానికి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3′(Grand Cross of the Order of Makarios 3)ని మోదీకి సోమవారం అందజేసింది. ప్రపంచంలో బలమైన నేతగా ఎదిగిన ప్రధాని మోదీకి వివిధ దేశాలు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలు అందజేశాయి. ఇందులో సౌదీ అరేబియా, ఈజిప్టు, అమెరికా, యూఏఈ, అఫ్ఘానిస్తాన్, ఫ్రాన్స్, గ్రీస్, భూటాన్, రష్యా తదితర దేశాలు మోదీని అత్యుతున్న పురస్కారంతో గౌరవించాయి. తాజాగా ఆ జాబితాలో సైప్రస్ కూడా చేరింది.
Cyprus | ఇరు దేశాల స్నేహానికి ప్రతీక..
సైప్రస్ ప్రభుత్వ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. ఆయన ఈ గౌరవాన్ని స్వీకరిస్తూ ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇరుదేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైవ కుటుంబ భావనకు ప్రతీక అని చెప్పారు. రెండు దేశాల మధ్య క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అవార్డు ప్రదానానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సైప్రస్ అవార్డు(Cyprus Award) అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, ఇరుదేశాల మధ్య స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నామని చెప్పారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం సైప్రస్ చేరుకున్న ప్రధానికి నికోస్ క్రిస్టోడౌలిడెస్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు.