అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే భోజనం పెడుతూ పేదల కడుపును నింపుతున్న అన్నపూర్ణ భోజన కేంద్రాల (Annapurna Food Centres) పేరు మారబోతోంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ (GHMC Standing Committee) కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అన్నపూర్ణ ఫుడ్ కేంద్రాలను ఇందిర క్యాంటీన్లుగా పేరు మార్చాలని స్టాండింగ్ కమిటీ ముక్త కంఠంతో ఆమోదం తెలిపింది.
Indira Canteens : ఇకపై పర్మినెంట్ ప్లేస్..
అన్నపూర్ణ భోజన కేంద్రాల(Annapurna Food Centres) లో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం మాత్రమే పెట్టేవారు. పేరు మారిన ఇందిరా క్యాంటీన్లలో ఇకపై రూ. 5 భోజనంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ (టిఫిన్) breakfast (tiffin) అందుబాటులో ఉండబోతోంది. దీనికితోడు భోజన కేంద్రాలకు శాశ్వత స్థలాలు కేటాయించి, అక్కడ షెడ్లు నిర్మించాలని కమిటీ (GHMC Standing Committee) ఆమోదం తెలపడం విశేషం.
Indira Canteens : పే అండ్ యూజ్ పద్ధతితో..
విశ్వనగరం హైదరాబాద్(Hyderabad)లో ప్రధాన సమస్య టాయిలెట్స్ నిర్వహణ. ప్రస్తుతం ఉన్నవి పూర్తిస్థాయిలో శుభ్రంగా లేకపోవడంతో ప్రజలు అందులోకి వెళ్లడానికి జంకుతున్నారు. ఇకపై ఈ పరిస్థితి మారబోతోంది. వాటిని ఆధునికీకరించి పే అండ్ యూజ్ (pay and use) పద్ధతిలో నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ (GHMC Standing Committee) ఆమోదం తెలిపింది.